ఆకట్టుకున్న మన్ –ఫకీరీ- సూఫియానా – సంగీత కచేరీ మరియు సురేంద్ర సింగ్ నేగి, విపుల్ రిక్కీ వారి బృందం భక్తి సంగీతాలాపనలో మైమరపించిన మధురగీతాలు
వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంపీ థియేటర్ లో, “ మన్ –ఫకీరీ- సూఫియానా – సంగీత కచేరీ” నిర్వహించడం జరిగింది.
ప్రముఖ కవి, రచయిత, గాయకుడు శ్రీ సురేంద్ర సింగ్ నేగి గారు సూఫీ, భక్తి సంగీతాలాపనలో ఎన్నో మధురగీతాలను ఆలాపన చేశారు.
శ్రీ విపుల్ రిక్కీ ప్రముఖ కవి, గాయకులు తమ బృందంచే భక్తి మరియు సూఫీ, భేలే సంగీతాన్ని ఆలపించారు. వీరు ప్రముఖంగా కబీర్ రచించిన గేయాలను ఆలపించి మైమరపించారు.
కళాకారులందరినీ శ్రీ మహమ్మద్ అలీ బేగ్, థియేటర్ ఆర్టిస్ట్ గారు సన్మానించారు.