పబ్బతి శివకు ఉప్పల్ ప్రెస్ క్లబ్ సంతాపం
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన జర్నలిస్టు పబ్బతిశివకు ఉప్పల్ ప్రెస్ క్లబ్ నివాళులర్పించి, సంతాపం ప్రకటించింది. ఆయన చిత్రపటానికి జర్నలిస్టులు పూల మాలలు వేసి, పత్రికారంగానికి పబ్బతి శివ చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ఏ జర్నలిస్టుకు ఎదురుకావొద్దని కోరుకున్నారు. శివ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ప్రెస్ క్లబ్ సభ్యలు కోరుకున్నారు.
పబ్బతి శివ కుటుంబాన్ని కలిసి పరామర్శించిన ఉప్పల్ ప్రెస్ క్లబ్ బృందం ఆ కుటుంబానికి అండగా వుంటామని తెలియజేసి, తక్షణ అవసరాల కోసం రూ. 11 వేలు అందజేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి, ప్రెస్ అకాడమీ నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అందేలా చూస్తామని సభ్యులు వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. త్వరలోనే మరింత సాయం అందేందుకు అందరం కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ నిర్వాహకులు, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.