ప్రొ. కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా సాంస్కృతిక శాఖ ఘనంగా నివాళులు. “తెలంగాణ కాలజ్ఞాని” డాక్యుమెంటరీ ప్రదర్శన
తెలంగాణ ప్రాంతం పై జరుగుతున్న అన్యాయాన్ని వివరించిన స్వాభిమాని జయశంకర్ సార్: మామిడి హరికృష్ణ
ప్రొ. కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా సాంస్కృతిక శాఖ ఘనంగా నివాళులు.
“తెలంగాణ కాలజ్ఞాని” డాక్యుమెంటరీ ప్రదర్శన.
తెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రొ. కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా… ఈరోజు సాయంత్రం 6:00 గంటలకు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, రవీంద్ర భారతిలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంచాలకులు మామిడి హరికృష్ణ ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మామిడి హరికృష్ణ, తెలంగాణ జాగృతి మేడే రాజీవ్ సాగర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సంచాలకులు హరికృష్ణ మాట్లాడుతూ… జీవితాంతం నీళ్ళు, నిధులు, నియామకాలు, మనదైన యాస, భాష, సంస్కృతి విషయంలో తెలంగాణ ప్రాంతం పై జరుగుతున్న అన్యాయాన్ని వివరించిన స్వాభిమాని జయశంకర్ సార్ అని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను తన భుజాల మీద వేసుకొని స్వరాష్ట్రం స్వయంపాలనే ధ్యేయంగా, ముందుండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారని, తన ఉపన్యాసాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలందరికి వినిపించిన వ్యక్తి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మన తెలంగాణను చూడలేమన్న పట్టుదలతో, ప్రాంతీయ అస్తిత్వవాదాన్ని ప్రకటిస్తూ తెలంగాణ కోసమే బతికిన ప్రజల మనిషి ప్రొ. కొత్తపల్లి జయశంకర్, ఆయన భావజాలమే తెలంగాణను నడిపిస్తున్నదని పేర్కొంటూ భాషా సాంస్కృతిక శాఖ తరపున నివాళులు అర్పించారు.
మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ… తెలంగాణ కోసం జయశంకర్ సార్ పోరాటం చేయకుంటే, తెలంగాణ రాకుంటే ఈరోజున రవీంద్రభారతిలో మనం నిలబడి ఉండేవాళ్ళం కాదని, తెలంగాణకోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మనిషి జయశంకర్ గారు అని అన్నారు.
అనంతరం, జయశంకర్ పై ‘చే’రన్ రూపొందించిన “తెలంగాణ కాలజ్ఞాని” డాక్యుమెంటరీ ప్రదర్శన జరిగింది.
ప్రదర్శన అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మరియు జి.హెచ్.ఎం.సి. డిప్యూటీ కమీషనర్ తిప్పర్తి యాదయ్య పాల్గొని డాక్యుమెంటరీని, దర్శకుడు ‘చే’రన్ ను అభినందించారు.