ఉప్పల్ లోని అభి సాయిదత్త అనాధాశ్రమానికి ఓమిని వాన్ ని, వాటర్ ఫిల్టర్ ని, బ్లాంకెట్స్లను ఇచ్చిన దాతలు
అభిసాయి దత్త ట్రస్ట్ అనాధ ఆశ్రమానికి సేవాభావంతో తమవొంతు సహకారాన్ని అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలపడానికి నిర్వహించిన కార్యక్రమంలో దాతలు మాట్లాడుతూ 40 మంది పిల్లలు ఉన్న ఈ ఆశ్రమాన్ని నడుపుతున్న జానకమ్మ చేసే సేవలో తమవంతు పాలు పంచుకోవడం, ఎంతో సంతోషంగా ఉందని, ఇలాగే అనేక మంది దాతలు ముందుకొచ్చి, ఈ అభిసాయి దత్త ఆశ్రమాన్ని ఆదుకోవాలని వారు కోరారు.
ఈ సందర్బంగా దాతలు విజయ్ కుమార్ గారు ఓమిని కార్ ను, దాతలు సంజీవ్ రెడ్డి గారు, హరిప్రసాద్ సాయి గారు వాటర్ ఫిల్టర్ ను, దాతలు శేషారత్నం రఘు గారు బ్లాంకెట్స్లను ఆశ్రమానికి ఇచ్చారు.
ఆశ్రమ నిర్వాహకులు జానకమ్మ మాట్లాడుతూ ఈ రోజు ఇలా దాతలు ముందుకు రావడం ఎంతో సంతోషకరమని, వారందరికీ ఎంతో రుణపడి ఉంటానని వారికీ కృతజ్ఞతలు తెలిపారు. మీ ఆనంద సమయాలని మా పిల్లల మధ్య జరుపుకోవాలని మా పిల్లల కోరిక అని విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమం సందర్భంగా పిల్లలు పాడిన పాటలు, నృత్యాలు అలరించాయి.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న దాతలకు, పెద్దలకు, మిత్రులకు నిర్వాహకులు జానకమ్మ, నవీన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.