హోమ్ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన మహమూద్ అలీ
ఈ రోజు సచివాలయంలో మహమూద్ అలీ హోమ్ మంత్రి గా బాధ్యతలు స్వీకరించారు.
మహమూద్ అలీ మాట్లాడుతూ…నేను హోమ్ మినిస్టర్ గా ఇవాళ బాధ్యతలు స్వీకరించా. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి పోలీసు ఉన్నతాధికారులు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు మహమూద్ అలీని కలిసి పుష్ఫగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం కొనసాగేలా చూస్తానని అదేవిధంగా ప్రజల్లో భరోసా పెరిగేలా ఫ్రెండ్లీ పోలీసింగ్తో పనిచేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
నాకు 2వ సారి మంత్రివర్గంలో అవకాశం కల్పించిన కేసీఆర్ కి ధన్యవాదాలు. మొదటిసారి డిప్యూటీ సీఎం గా… 2వ సారి హోమ్ మంత్రి గా ఛాన్స్ దక్కింది. దేశంలోనే నంబర్ వన్ లీడర్ కేసీఆర్. నేను రెవెన్యూ మంత్రిగా విశేష సేవలు అందించా. కొత్త జిల్లాల ఏర్పాటు చేశాం… కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చాం అని అన్నారు.
ఇండియా లోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉంది… రాజ్ నాథ్ సింగ్ కూడా అభినందించారన్నారు..
శాంతిభద్రతలకు పెద్ద పీట వేశాం. క్రైమ్ రేట్ ఇంకా తగ్గిస్తాం. పోలీసులకు వీక్ ఆఫ్ ఇచ్చే విషయంలో డీజీపీ ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా తెలిపారు.
సచివాలయంలో హోం మంత్రి గా భాధ్యతలు స్వీకరించుటకు ముందు మంత్రి గారు నాంపల్లి లోని యూసుఫియన్ దర్గా ను దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు.