శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
2020 శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
అక్టోబరు 16, తిరుమల 2020: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేపట్టారు. ఆ తరువాత ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆస్థానం జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్రెడ్డికి అర్చకులు కంకణధారణ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ డిపి.అనంత, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, కంకణభట్టార్ శ్రీ రామకృష్ణ దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విజిఓ శ్రీ మనోహర్, పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.