గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్, కమీషన్ సభ్యుడు చెన్నయ్య, మెంబర్ సెక్రెటరీ సురేష్ చందా, రణధీర్ గౌడ్, ఓ.ఎస్.డి నాగరాజు.
రాజేశం గౌడ్ గారు గవర్నర్ తో మాట్లాడుతూ కాళేశ్వరం,మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలతో దేశంలోనే గొప్ప కార్యక్రమాలను సీఎం కెసిఆర్ గారు చేపడుతున్నారు. ళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగు నీరు హైదరాబాద్ కి తాగు నీరు అందిస్తున్నారు. మిషన్ కాకతీయ తో చెరువులన్నీ జలకళతో నిండి ఉన్నాయి. మిషన్ భగీరథ ప్రతి ఇంటికి తాగు నీటిని అందిస్తుంది. రివర్స్ పంపింగ్ ద్వారా srsp కూడా నిండనుంది. టన్నిటితో తెలంగాణ లో రైతు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక్కసారి సందర్శించాలని గవర్నర్ ని కోరినము. గవర్నర్ విద్య వేత్త చిన్న వయసులో గవర్నర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ది కి పూర్తి స్థాయిలో సహకరించాలి అని కొరినాము. గ్రామ జ్యోతి కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి సీఎం గారు కంకణం కట్టుకున్నారు అని గవర్నర్ కి వివరించాము. సీఎంకి మధ్యంతర రిపోర్ట్ పెట్టినప్పుడు గ్రామాల అభివృద్ధికి 1400 కొట్లు ఇవ్వాలని కోరితే 1600 కొట్లు ఇచ్చారు, మున్సిపల్ కి 900 ఇవ్వాలని రిపోర్ట్ చేస్తే 1100 కొట్లు కేటాయించారు. ఈ విధంగా స్థానిక సంస్థల, మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం గారు కృషి చేస్తున్నారు.
కేంద్ర ఆర్ధిక సంఘం మాదిరిగానే రాష్ట్ర ఆర్ధిక సంఘము గ్రామీణ పట్టణ స్థానిక సంస్దలకు రాష్ట్ర నిధులు వాటాలు నిర్ణయించుటకై రాష్ట్ర ఆర్ధిక సంఘం పని చేయు చున్న తీరును వివరిస్తూ ప్రస్తుతం జరుగుతున్నా పనివివరములు తెలుపనైనది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు ఇప్పటికే మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలను పర్యటించాను తమిళనాడు కూడా పరిశీలిస్తున్నట్లు గవర్నర్ కి తెలిపిన చైర్మన్ రాజేశం గౌడ్.
గవర్నర్ కి నోట్ బుక్స్ అందించాము. గవర్నర్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వాటిని పంచి పెడతాం అని ఆమె చెప్పారు.