టర్కీలో ఈనెల 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగిన వరల్డ్ కిక్ బాక్సింగ్ సబ్ జూనియర్ ఫైట్ విభాగంలో హైదరాబాద్ కు చెందిన U. మైత్రి బంగారు పథకం, ఈవెంట్ లో రజత పథకాలు సాధించింది. సచివాలయంలో రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక మరియు స్పోర్ట్స్ మంత్రి డా.V. శ్రీనివాస్ గౌడ్ ను కలసి తాను పథకం సాధించిన వివరాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మైత్రి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.