యాదాద్రి: కమనీయంగా, రమణీయంగా,అంగరంగ వైభవంగా జరిగిన శ్రీలక్ష్మీనరసింహుల తిరు కల్యాణ మహోత్సవం
శనివారం ఉదయం బాలాలయంలో, రాత్రి కొండ కింద బస్టాండ్ ఎదురుగా గల పాత జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో కన్నుల పండువగా జరిగింది.
వేలాది భక్తులు కళ్యాణోత్సవానికి హాజరయ్యారు . రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు . అర్చక స్వాములు శాస్త్రోక్తంగా , కన్నులవిందుగా కల్యాణోత్సవం నిర్వహించారు . ఈఓ గీత ఆధ్వర్యంలో దేవస్థానం వారు చక్కని ఏర్పాట్లు చేసారు .