కామన్వెల్త్ లో తెలంగాణా క్రీడాకారుల సందడి
హైదరాబాద్ , మార్చి 4: ఆస్ట్రేలియా లోని గోల్డ్ కోస్ట్ లో బుధవారం కన్నుల పండుగగా ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర క్రీడాకారులు, ప్రతినిదుల బృందం సందడి చేసింది. తెలంగాణా క్రీడల మంత్రి టీ.పద్మారావు గౌడ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర క్రీడల ప్రాధికారత సంస్థ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ SM రాజేశ్వర్ రావు లతో పాటు పలువురు అధికారులు, క్రీడా, ఇతర సంఘాల ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణా రాష్ట్ర ప్రతినిదులతో కలిసి మంత్రి పద్మారావు గౌడ్ జాతీయ పతకంతో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన రాష్ట్రం తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన క్రీడాకారులను సమన్వయం చేస్తూ మంత్రి పద్మారావు గౌడ్ క్రీడాకారులను ప్రోత్సహించారు.